హుజురాబాద్ /జనవరి 21(మా అక్షరం):జూపాక గ్రామంలో నిర్వహించనున్న శ్రీ సమ్మక్క–సారలమ్మ జాతరకు సంబంధించి జాతర పోస్టర్ను జాతర కమిటీ సభ్యులతో కలిసి హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ప్రణవ్ బాబు బుధవారం ఘనంగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రభుత్వ పరంగా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. తాగునీరు, వైద్య సదుపాయాలు, పారిశుద్ధ్యం, రవాణా వంటి మౌలిక వసతులను పకడ్బందీగా ఏర్పాటు చేస్తామని తెలిపారు.జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాతర కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. జాతర ఏర్పాట్లను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జాతర కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు.
Post Views: 562











