జర్నలిస్ట్ శ్రీనివాస్ మాతృమూర్తి మృతికి హుజురాబాద్ ప్రెస్ క్లబ్ సంతాపం…
– బాధిత కుటుంబానికి రూ. 10,000 ఆర్థిక సాయం అందజేత…
హుజురాబాద్/ ఏప్రిల్ 14(మా అక్షరం): హుజురాబాద్ ప్రెస్ క్లబ్ సభ్యుడు, జర్నలిస్ట్ మర్రి శ్రీనివాస్ కుటుంబంలో చోటుచేసుకున్న విషాదం పట్ల ప్రెస్ క్లబ్ సభ్యులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. శ్రీనివాస్ తల్లి మర్రి కొమరమ్మ ఇటీవల పాముకాటుకు గురై మృతి చెందడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, మంగళవారం వారి నివాసానికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించారు.ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ తరపున బాధిత కుటుంబానికి అండగా రూ.10,000/- నగదును ఆర్థిక సహాయంగా అందజేశారు.ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ…ప్రెస్ క్లబ్ ఎల్లప్పుడూ తమ సభ్యుల సంక్షేమానికి కట్టుబడి ఉంటుంది. శ్రీనివాస్ కుటుంబానికి వచ్చిన ఈ కష్టం తీరనిది. ఆయన కుటుంబం ధైర్యంగా ఉండాలని కోరుకుంటూ, ప్రెస్ క్లబ్ తరపున ఎల్లవేళలా సహకారం ఉంటుందని భరోసా ఇస్తున్నాం.ఈ పరామర్శ కార్యక్రమంలో హుజురాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కాయిత రాములు, సీనియర్ జర్నలిస్ట్ కోరం సుధాకర్ రెడ్డి, కౌన్సిలర్ గోస్కుల రాజకుమార్, రిపోర్టర్లు కుడికాల సాయి (మా అక్షరం), పోతరాజు సంపత్ (అక్షర నేస్తం), భరత రజనీకాంత్ (తెలంగాణ వాణి) తదితరులు పాల్గొన్నారు












