గ్రంథాలయాలు జ్ఞాన విస్తరణకు మూల స్తంభాలు
హుజురాబాద్ ఏప్రిల్ 16 (మా అక్షరం): ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న 99 రోజుల కార్యక్రమాల్లో భాగంగా గురువారం హుజురాబాద్ శాసన గ్రంథాలయం ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గ్రంథాలయ సభ్యత్వ మేళా నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని గ్రంథపాలకురాలు కనక లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి విడపు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ…విద్యార్థినీ విద్యార్థులకు గ్రంథాలయాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ గ్రంథాలయ సభ్యత్వం పొందాలని సూచిస్తూ, సభ్యత్వ నమోదు ప్రాధాన్యతను వివరించారు.అనంతరం విద్యార్థులకు సభ్యత్వ నమోదు చేపట్టించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, రిటైర్డ్ పీజీహెచ్ఎం వేల్పుల రత్నం, ఎల్ఎఫ్ఎల్ రిటైర్డ్ హెచ్ఎం చందుపట్ల జనార్ధన్, గ్రంథాలయ సహాయకురాలు జ్యోతి తదితరులు పాల్గొన్నారు.












