+91 99635 77856

కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా టేకుల శ్రావణ్

హుజురాబాద్/ ఏప్రిల్ 20(మా అక్షరం): కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా హుజురాబాద్ పట్టణానికి చెందిన టేకుల శ్రావణ్ ఎన్నికయ్యారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ఎన్నికైన టేకుల శ్రావణ్ మాట్లాడుతూ… తనపై నమ్మకంతో జిల్లా కార్యదర్శిగా ఎంపిక చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, జిల్లా అధ్యక్షులు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్, మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, రాష్ట్ర ఎస్సీ సెల్ మాజీ జాయింట్ కన్వీనర్ దొంత రమేష్ లకు కృతజ్ఞతలు తెలిపారు. శ్రావణ్ జిల్లా కార్యదర్శిగా ఎన్నిక పట్ల హుజరాబాద్ మండల, పట్టణ అధ్యక్షులు కొల్లూరి కిరణ్, మేకల తిరుపతి, మహిళా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు వేముల పుష్పలత తోపాటు పలువురు హర్షం వ్యక్తం చేశారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !