+91 99635 77856

కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా నేరెళ్ల మహేందర్ గౌడ్

హుజురాబాద్/ ఏప్రిల్ 20 (మా అక్షరం):కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా నేరెళ్ల మహేందర్ గౌడ్ ను నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. నేరెళ్ల మహేందర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ కార్యకర్తగా పార్టీ కోసం అహర్నిశలు కృషి చేశాడు. కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ మండల అధ్యక్షుడిగా పనిచేశాడు. మహేందర్ గౌడ్ సేవలను గుర్తించి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ జిల్లా అధికార ప్రతినిధిగా నియమించింది. అధికార ప్రతినిధిగా తనను నియమించడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు మేడిపల్లి సత్యం, హుజరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ లకు మహేందర్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !