ఎల్కతుర్తి మండల్ : WWF-India, Better Cotton (BCI) మరియు నవక్రాంతి రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఆధ్వర్యంలో పెంచికల్పేట్ గ్రామంలో రైతులకు పురుగుమందుల జాగ్రత్తలు, వ్యక్తిగత రక్షణ పరికరాల (PPE) వినియోగం మరియు అత్యంత ప్రమాదకరమైన పురుగుమందులు (HHPs)పై అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా BCI Field Facilitator వంగా రఘు మాట్లాడుతూ, రైతులు పురుగుమందులను సురక్షితంగా వినియోగించాలని, లేబుల్పై ఉన్న సూచనలను తప్పనిసరిగా పాటించాలని, పిచికారీ సమయంలో PPE ధరించాలని సూచించారు. HHPల వల్ల కలిగే ప్రమాదాలను గుర్తించి, వీలైనంత వరకు సురక్షితమైనప్రత్యామ్నాయాలనుఉపయోగించాలని రైతులకు అవగాహన కల్పించారు.అనంతరం గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించి, పురుగుమందుల సురక్షిత వినియోగం, PPE ప్రాముఖ్యత మరియు HHPల ప్రమాదాలపై రైతులకు అవగాహన కల్పించారు.అలాగే **బయోచార్, అంతర పంటల సాగు, ఫెరోమోన్ ట్రాప్స్, స్టిక్కీ కార్డ్స్ మరియు కాండానికి బొట్టు పద్ధతి (Stem Application)**పైక్షేత్రస్థాయిప్రదర్శనలునిర్వహించారు. బయోచార్ ద్వారా నేల ఆరోగ్యం, తేమ నిల్వ మరియు పంట ఎదుగుదల మెరుగుపడే విధానాన్ని వివరించారు. అంతర పంటల సాగు ప్రయోజనాలను, ఫెరోమోన్ ట్రాప్స్ మరియు స్టిక్కీ కార్డ్స్ ద్వారా పురుగుల పర్యవేక్షణ, ముందస్తు గుర్తింపు మరియు సకాలంలో పంట రక్షణ చర్యలు చేపట్టే విధానాన్ని వివరించారు. కాండానికి బొట్టు పద్ధతినిక్షేత్రంలోరైతులకుప్రాక్టికల్గాప్రదర్శించారు.ఈకార్యక్రమంలో రైతులు చురుకుగా పాల్గొని, తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. సురక్షితమైన మరియు సిఫార్సు చేసిన పంట రక్షణ పద్ధతులను తమ పొలాల్లో అమలు చేయడానికి రైతులు సుముఖత వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో BCI ప్రతినిధులు రావుల లత, సురకంటి రజిత, రైతులు పాల్గొన్నారు.













