ఎల్కతుర్తి/ఆగస్టు 8 (మా అక్షరం):
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీ-పీసీసీ) సోషల్ మీడియా చైర్మన్గా శ్రీ నవీన్ పెట్టం ఎంపిక కావడం హర్షణీయమని ఎల్కతుర్తి మండల కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ అంబాల జగన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తోందన్నారు. నవీన్ పెట్టం నాయకత్వంలో టీ-పీసీసీ సోషల్ మీడియా విభాగం మరింత చురుకుగా పనిచేసి పార్టీ విధానాలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నవీన్ పెట్టం ఎంపిక పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అంబాల జగన్ నవీన్ పెట్టంకు అభినందనలు తెలియజేశారు.
Post Views: 22













