హుజురాబాద్/ ఆగస్టు 05(మా అక్షరం):కష్టాల్లో ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటామని హుజురాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ అన్నారు. పట్టణంలోని 23వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ వార్డు సభ్యుడు గంధం శివరాం ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా, బుధవారం ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం రూ.3.50 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా మృతుడి కుటుంబాన్ని ఓదార్చి, పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సుహాసిని,కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు,పట్టణ అధ్యక్షుడు తిరుపతి,వార్డు అధ్యక్షులు,ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 128













