హుజురాబాద్/ ఆగస్టు05(మా అక్షరం): బాధిత కుటుంబాలకు ప్రణవ్ పరామర్శ హుజురాబాద్, జమ్మికుంట పట్టణాల పరిధిలోని పలు వార్డుల్లో ఇటీవల మరణించిన వారి కుటుంబాలను బుధవారం హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని ప్రణవ్ సూచించారు. పలువురు స్థానిక నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన వెంట పాల్గొన్నారు.
Post Views: 11













