హుజూరాబాద్/ ఆగస్టు 06 (మా అక్షరం): మున్సిపల్ కార్యాలయంలో గురువారం ఆచార్య శ్రీ కొత్తపల్లి జయశంకర్ జయంతిని పురస్కరించుకొని మున్సిపల్ చైర్పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్రావు, మున్సిపల్ కమిషనర్ బి. కిషన్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…జయశంకర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, మేనేజర్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post Views: 15













